బెంగాల్ లో దారుణం…. స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాాచారం

-

కట్టుకున్న వాడే కామాంధుడిగా మారాడు. నూరేళ్లు తోడుగా ఉంటానని చెప్పిన వాడే తన స్నేహితులతో భార్యను చెరిచాడు. ఈ అమానవీయమైన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ దారుణమైన సంఘటన బెంగాల్ లో జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే… బెంగాల్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్తే తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సదరు బాధితురాలి బంధువుల ఇంట్లోనే జరిగింది. బీహర్ కు చెందిన ఓ మహిళ వైద్యం కోసం కోల్ కతా వెళ్లింది. ఆ సమయంలో ఆమె భర్తతో కలిసి మరో ఇద్దరు స్నేహితులు మద్యం తీసుకుంటున్నారు. మత్తులో ఉన్న భర్త స్నేహితులు… భర్త ముందే మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై బలవంతం చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం జరిగింది. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళను వైద్య పరీక్షల కోసం పంపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news