తెలంగాణలో దారుణం.. మహిళకు మత్తు మందు ఇచ్చి !

-

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పటాన్ చెరువు మండలంలోని రామేశ్వరం బండకు చెందిన ఓ మహిళను ఓ జంట దారుణంగా మోసం చేసింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళను ఓ జంట స్కూటీపై ఎక్కించుకున్నారు.

మాట మాట కలిపి మత్తు కలిపిన కళ్ళు తాగించారు. అనంతరం ఆ మహిళపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.25000 తీసుకొని పరారయ్యారు. మత్తు దిగిన తర్వాత బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news