ఆస్తి కోసం భార్యను బాత్రూంలో బంధించి ఏం చేశాడంటే..!

-

Husband Trashed wife for her assets in bihar

ఓ వ్యక్తి ఆస్తి కోసం భార్యకు నరకం చూపించాడు. భార్య పేరున ఉన్న ఆస్తిని తన పేరున రాయించుకోవడం కోసం తనకు చిత్ర హింసలు పెట్టాడు. తనను తాడుతో కట్టేసి బాత్రూంలో బంధించి బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. భర్త చిత్రహింసలను తట్టుకోలేక ఆ మహిళ గట్టిగా అరవడంతో ఆమె కేకలు విన్న స్థానికులు… ఆ ఇంట్లోకి వెళ్లగా బాత్రూంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ మహిళ కనిపించింది. ఇరుగుపొరుగును గమనించిన ఆ వ్యక్తి అక్కడినుంచి పరారవడంతో.. బాధితురాలి కట్లు విప్పి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన బీహార్ లోని పూర్ణియాలో చోటు చేసుకున్నది. బాధితురాలు కోలుకున్నాక భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న ఆమె భర్త కోసం గాలిస్తున్నారు. ఆమెకు 2001 లో సంజయ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాది నుంచి భర్త, అత్తింటి వాళ్లు కట్నం తీసుకురావాలంటూ తనను వేధించేవారు. ఓసారి ఆమెపై యాసిడ్ తోనూ దాడి చేశారు. ఇప్పుడేమో తన పేరిట ఉన్న ఆస్తిని వాళ్ల పేరు మీద రాయాలని ఆమె భర్త హింసించడం ప్రారంభించాడు.

Read more RELATED
Recommended to you

Latest news