హైదరాబాద్‌ హైటెక్‌సిటీ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం..

-

హైదరాబాద్‌ హైటెక్‌సిటీ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. నోవాటెల్ వద్ద కారు- బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పెగా కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న అభిషేక్‌ ఆనంద్‌గా గుర్తించారు.

రాంగ్‌ రూట్‌లో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో కారు డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో డ్రైవ్‌ చేసినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ అశ్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news