నారాయణపేట జిల్లాలో దారుణం…. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

-

అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరసగా ఎక్కడో చోట అక్రమ సంబంధాలు, హత్యలు బయట పడుతూనే ఉన్నాయి. ప్రియుడిపై మోజుతో భర్తను చంపే భార్య ఒకరైతే… భర్త ముందే తన అనైతిక సంబంధాలు నడిపే భార్య మరొకరు, ఇంకో చోట భర్తకు తెలియకుండా ప్రియుడితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ… బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడిని హత్య చేయించేలా చేసిన భార్య ఇలా… గడిచిన కొన్ని రోజుల నుంచి అక్రమ సంబంధాల వల్ల హత్యలు జరిగాయి.

తాజాగా ఇలాంటి సంఘటనే నారాయణ పేట జిల్లాలో చోటు చేసుకుంది. ఉట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామంలో గత నెల 22న యూనుస్ (34) హత్య జరిగింది.  యూనుస్ తండ్రి ఇమాం సాబ్ కొడుకు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ దర్యాప్తులో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. తను కొనసాగిస్తున్న అక్రమ సంబంధానికి, భర్త అడ్డు వస్తున్నాడని, ప్రియుడు అరఫత్ (28) తో కలిసి, ఫరజాణ బేగం, (26) తన భర్త యూనుస్  గొంతుకు చున్నీతో చుట్టి మెత్తతో మొఖంపై వత్తడంతో, ఊపిరాడక చనిపోయాడు. నిందితులను రిమాండుకు తరలించిన పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news