బిర్యానీ కోసం బండ బూతులు..ఆపై దాడి..చివరికి..

-

భోజన ప్రియులకు ఏమి వచ్చినా ఆపుకోలేరు.ఆకలి వేసిన, వండింది నచ్చకపొయిన అస్సలు ఊరుకోరు..హోటల్ లో తినే బిర్యాని గురించి చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య బిర్యానిలో వస్తున్న వాటిని వింటే మాత్రం జీవితంలో బిర్యాని జోలికి వెళ్లరు..మొన్న ఓ వ్యక్తికి బిర్యానీలో రావడం చూసిన వాళ్లంతా బిర్యానిని తినడానికి ఆసక్తి చూపించలేదు.. తాజాగా తెలంగాణలోనే మరో ఘటన వెలుగు చూసింది.కొందరు యువకులు బిర్యాని రుచి నచ్చలేదని హోటల్ పై వీరంగం సృష్టించారు..డబ్బులు ఇచ్చాము మాకు మంచి బిర్యాని కావాలి అంటూ అక్కడ ఉన్న సిబ్బంది, యాజమాన్యం పై దాడి చెయ్యడం తో హోటల్ లోని ఫర్నిచర్ ద్వంసం అయ్యింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ యువకులు అక్కడి నుంచి ఉడాయించారు.

 

ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. బిర్యానీ రుచిగా లేదంటూ హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఓ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ రుచిగా కాలేదంటూ కోపంతో ఊగిపోయారు ఐదుగురు వ్యక్తులు.నోటికి వచ్చిన బూతు మాటలు తిడుతూ హల్‌చల్‌ చేశారు. రెస్టారెంట్ యజమాని సంతోష్ , కుకర్, వెటర్ వర్కర్ల పై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రెస్టారెంట్ లోని ఫర్నీచర్‌ మొత్తం ధ్వంసం చేశారు.

స్థానికంగా ఉండే ఓ రెస్టారెంట్‌కు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. బిర్యానీ కావాలని ఆర్డర్‌ పెట్టారు. అయితే, వెయిటర్‌ బిర్యానీ తీసుకొచ్చారు. కానీ, ఆ వచ్చిన వ్యక్తులకు బిర్యానీ నచ్చలేదట. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ ఐదుగురు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా హోటల్‌ సిబ్బందిపై దాడికి దిగారు. యువకుల దాడిలో హోటల్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో రెస్టారెంట్ లోని ఫర్నిచర్‌ని సైతం ధ్వంసం చేశారు ఆ ఐదుగురు వ్యక్తులు. దాడికి పాల్పడ్డ వారు బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు..ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news