ఈఎస్ఐ మెట్రోస్టేషన్‌ నుంచి దూకి యువతి ఆత్మహత్య

-

మహా నగరం హైదరాబాద్‌ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్‌ నుంచి అమాంతం దూకేసి.. ఓ యువతి ఆత్మహత్య యత్నం చేసింది. ఎస్సార్‌ నగర్‌ సమీపంలోని ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌ నుంచి ఓ యువతి కిందకు దూకేసింది.

దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్పందించి.. ఆమెను వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

యువతిని గాంధీ ఆస్పత్రి ని తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచింది. ఆత్మహత్య కు పాల్పడిన యువతిని ఎస్సార్‌ నగర్‌ పరిధి లోని శ్రీ రామ్‌ నగర్‌ కు షబానాగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే ఆ యువతి ఆత్మహత్య కు కారణమని సమాచారం అందుతోంది. ప్రేమ వ్యవహారం కోణంలో.. పోలీసులు ప్రస్తు తం దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సుసైడ్‌ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news