ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి !

-

ఢిల్లీలో పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఘటనా స్థలంలో పోలీసులు ఒక లెటర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్లో ఇది ట్రైలర్ మాత్రమే అని రాసి ఉన్నట్లు గుర్తించారు.. ఈ పేలుడు ఘటనలో ఇరాన్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లెటర్లో కాసీం సులేమానే అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది బాగ్దాద్ లో qasim sulemani దారుణ హత్యకు గురయ్యాడు.

దీనికి సంబంధించిన అంశంలోనే పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇక సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఇద్దరు అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించారు. సగం కాలిన పింక్ చున్ని కూడా దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో పక్క ఈరోజు ఇజ్రాయిల్ దర్యాప్తు బృందం కూడా భారత్ రానుంది. తమ దౌత్య కార్యాలయం పక్కన పేలుడు సంభవించడంతో ఈ విషయం మీద భారత ప్రభుత్వాన్ని ఇజ్రాయిల్ వివరణ కోరింది. ఈ విషయం మీద అజిత్ దోవల్ ఇజ్రాయిల్ ప్రధాని కి పూర్తి సమాచారం అందించారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news