ప్యాకేజీ స్టార్‌ పవన్‌ అయితే.. వైఎస్‌ జగన్‌ పీపుల్స్‌ స్టార్‌ – మంత్రి దాడిశెట్టి రాజా

-

ప్యాకేజీ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అయితే పీపుల్స్‌ స్టార్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఎంతమంది మల్లులు ఎన్ని విల్లులు విసిరినా ఇక్కడ ఉంది పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదు.. ఎన్నో పద్మ వ్యూహాలను ఛేదించిన జగన్మోహనుడు.ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అనే విషయాన్ని మల్లులు, ఈ విల్లులు గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు దాడిశెట్టి రాజా.

2024లో మరోసారి జనసేన పార్టీని అద్దెకివ్వడానికి చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుకున్నారన్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తే అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వమంటారోనని నోరు మెదపని పవన్‌ కల్యాణ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే హక్కు లేదని ఫైర్ అయ్యారు.

పార్టీ పెట్టి తనను నమ్ముకున్న వాళ్లను అమ్మడమే సిద్ధాంతంగా పెట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ మంచి రేటు కోసం తాపత్రయ పడుతున్నారని తెలిపారు దాడిశెట్టి రాజా. పవన్‌ కల్యాణ్‌ది అమ్మే సిద్ధాంతం.. చంద్రబాబుది కొనే సిద్ధాంతం అని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారు. రైతు భరోసా ద్వారా నేరుగా అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఈ విషయాన్ని గమనించలేదా? అని దాడిశెట్టి రాజా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version