రాజాసింగ్‌తో చీకోటి..ఇదేం ట్విస్ట్..!

-

రెండు నెలల క్రితం ఓ మతాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన రాజాసింగ్..తాజాగా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే కోర్టు పలు ఆంక్షలు పెట్టడంతో రాజాసింగ్ మీడియాతో మాట్లాడటం లాంటివి చేయలేదు..సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదు. రాజాసింగ్ పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్‌ని చీకోటి ప్రవీణ్ కలవడం సంచలనంగా మారింది.

రాజాసింగ్ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ప్రవీణ్ భారీ ఎత్తున ర్యాలీతో వెళ్లాలని చూశారు. కానీ పోలీసులు పర్మిషన్ లేదనడంతో ప్రవీణ్ తన అనుచరులతో కలిసి రాజాసింగ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. అయితే ఒక హిందుత్వ వాదిగానే రాజాసింగ్‌ని కలిశానని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, హిందూ మతాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని, రాజాసింగ్‌ని ఎప్పుడు ఎమ్మెల్యేగా చూడలేదని, కేవలం హిందూ వాదిగానే చూశానని చెప్పారు.

మొత్తానికి క్యాసినో వ్యవహరాల్లో ఉందే చీకోటి ప్రవీణ్, రాజాసింగ్‌ని  కలవడం చర్చనీయాంశమైంది. ఆ మధ్య క్యాసినో, హవాలాకు సంబంధించి ప్రవీణ్‌ని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అలాగే చీకోటి కస్టమర్లుగా ప్రముఖ రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని తేలిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో తాను చట్టబద్ధంగానే క్యాసినో నిర్వహిస్తానని, పర్మిషన్ ఉన్న రాష్ట్రాల్లోనే ఆడతామని చెప్పిన ప్రవీణ్..త్వరలోనే రాజకీయాల్లోకి కూడా వస్తానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజాసింగ్‌ని కలవడం హాట్ టాపిక్ అయింది. అయితే రాజాసింగ్ ప్రస్తుతం సస్పెషన్‌లో ఉన్నారు. బీజేపీ ఆయనని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జైలు నుంచి బయటకు రావడంతో త్వరలోనే సస్పెన్షన్ ఎత్తివేస్తారని తెలుస్తోంది. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన నేపథ్యం, పైగా హిందూ వాదంతో ముందుకొస్తున్న ప్రవీణ్..బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయా? అనే డౌట్ కూడా వస్తుంది. ఏదేమైనా రాజాసింగ్‌ని చీకోటి కలవడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news