IPL 2022 : రసవత్తరంగా ఐపీఎల్.. నేడు రెండు మ్యాచ్ లు

-

ఐపీఎల్ 2022 నిన్న టోర్నీ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు ఐపీఎల్ లో… రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఇవాళ ఆదివారం ఉన్న నేపథ్యంలో రెండు మ్యాచ్లను నిర్వహిస్తోంది ఐపీఎల్ యాజమాన్యం.

ఇవాళ మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం లో జరగనుండగా.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది.  అలాగే రెండు మ్యాచ్ ల్లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తర పోరు జరగనుంది.

ఈ మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ లో జరగనుండగా… సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా..ఐపీఎల్ – 2022 లో తొలి మ్యాచ్ చెన్నైసూప‌ర్ కింగ్స్, కోల్‌కత్త నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్ లో కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు బోణీ కొట్టింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ పై కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news