టీడీపీ మానిఫెస్టోపై రెచ్చిపోయిన డిప్యూటీ సీఎం…

-

రాజమండ్రి వేదికగా జరిగిన మహానాడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంతా వైసీపీ నాయకులను మరియు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. కాగా ఇదే మహానాడులో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ఇదే అంటూ ప్రకటించారు. ఈ మానిఫెస్టోపై ఎప్పటిలాగే వైసీపీ నాయకులు ఒక్కొకరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపడేలా అయితే ఏమీ లేదని విమర్శలు చేశారు. మేనిఫెస్టో చూస్తే.. ఇది ప్రజలకు వెన్నుపోటు పొడిచే లాగా ఉంది కానీ… ప్రయోజనకరంగా ఉండదని ఫైర్ అయ్యాడు. ఈ మహానాడు లో టీడీపీ నాయకులు అందరూ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.

ఇలాంటి మేనిఫెస్టోలు ఎన్ని సృష్టించినా ప్రజలు జగన్ పక్షాన మాత్రమే నిలబడతారని గట్టి నమ్మకంతో మాట్లాడారు. ప్రతిసారీ టీడీపీ రాజమండ్రిలో మహానాడు పెట్టి సెంటిమెంట్ గా స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా అదే విధంగా మొదలు పెట్టారు. మరి ఇది వారికీ ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news