తెలంగాణ కేసీఆర్ అబ్బా జాగీరా : డీకే అరుణ

-

నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణ కు పట్టిన పీడ కేసీఆర్ అని ఆమె ఆరోపించారు.

అంతేకాకుండా.. కేసీఆర్ నియంత పోకడలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటే అని ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటే కేసీఆర్ కు అంత భయం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అండర్‌స్టాండ్ ధర్నాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ ధర్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ ఓర్వడం లేదని ఆమె అన్నారు. కేసీఆర్ తెలంగాణ కు చేసిన అభివృద్ధి ఏం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఖర్చు చేస్తుంది…ఈ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆమె అన్నారు.

తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్ష చేశాడు… మాస్టర్ ప్లాన్ తో రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. 220 జీవో ను రద్దు చేయాలి… సీఎం కేసీఆర్ ఎందుకు భయ పడుతున్నారు… రైతుల కు రుణం మాఫీ చేయడానికి మద్యం టెండర్లు వేయేస్తున్నడు… తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి, కేసీఆర్ కు సిగ్గు లేదు… కేసీఆర్ ను గద్దె దించేవరకు తెలంగాణ ప్రజలు నిద్రపోరు… కేంద్ర పథకాలను పక్క దోవ పట్టిస్తున్నారు… తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం అనివార్యం… కేసీఆర్ మోసాలను ,కేటీఆర్ మోసాలను ప్రజల కు చెప్తాం… కేసీఆర్ కుటుంబ నికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి… ఒక మహిళ అని చూడకుండా పోలీసులు ఇష్టనుసరంగ వ్యవహరించారు… నిరాహార దీక్షను విరమణ చేయడానికి వెళ్తుంటే లాండ్ అండ్ ఆర్డర్ సమస్య వస్తది అని నన్ను అడ్డుకున్నారు…’ అని డీకే అరుణ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news