కెసిఆర్ మాయమాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దు – వైయస్ షర్మిల

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 174వ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ తాడ్వాల్ మండలం కృష్ణాజివాడ గ్రామంలో ప్రారంభం అయింది. అక్కడి నుంచి బ్రహ్మాజీ వాడ, దేవాయిపల్లి, తాడువాయి గ్రామాల మీదుగా సాగుతోంది. సాయంత్రం లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో మాటా ముచ్చట నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు షర్మిల.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కెసిఆర్ మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని సూచించారు. కెసిఆర్ పాలనలో ప్రతి పథకం మోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ సంక్షేమ పథకాలను తెలంగాణలో ఆపేసారని మండిపడ్డారు. టిఆర్ఎస్ చెప్పే రైతు ప్రభుత్వంలో ఎనిమిది వేల మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మంచివారికి ఓటేస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి అన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news