కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి 5 గురు మృతి.. భద్రత పెంపు ?

-

కేబుల్ బ్రిడ్జి పై నుంచి దుర్గం చెరువులో దూకి నిన్న స్వప్న అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు స్వప్న మృతదేహం దొరుకాలేదు. నేడు మరోసారి స్పీడ్ బోట్స్, డిఆర్ఎఫ్ సిబ్బందితో గాలించునున్న పోలీసులు.. దుర్గం చెరువు లో బురద ఎక్కువగా ఉండడంతో మృతదేహం చిక్కుకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్ కు లోను కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేబుల్ బ్రిడ్జి పై నుంచి దుర్గం చెరువులో దూకి ఇప్పటికి 5 మంది పైన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కేబుల్ బ్రిడ్జి వద్ద భద్రత ను పెంచాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ చెయ్యాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా కేబుల్ బ్రిడ్జి పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న స్వప్న.. భర్తతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news