BREAKING : వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భూకంపం..పరుగులు తీసిన జనాలు

-

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీరు, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలాలలో భూకంపం చోటు చేసుకుంది. భూ ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ జనాలు.. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దోమస్తపూర్, బుచ్చనపల్లి, మర్పల్లి గ్రామా ల్లోనూ ఈ భూ ప్రకంపనలు చోటు చేసు కున్నాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన కు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. అయితే ఈ భూ ప్రకంపనలు ఇవాళ ఉదయం 10గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు.. ఇటీవలే మంచిర్యాల జిల్లా, హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతాల్లో కూడా భూకంపం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా భూకంపం పై సిస్మో గ్రఫీ అధికారులు… పరిశీలనల ప్రారంభించారు. దీనిపైసాయంత్రం లోగా అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news