పర్యాటక ప్రాంతంగా ఏడుపాయల: హరీష్ రావు

-

మెదక్ ఏడుపాయల లో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని.. తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని.. యాదాద్రి ని అద్భుతంగా తీర్చిదిద్దాం…కొండగట్టు కు రూ 1000 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తుందని.. రాష్ట్ర ప్రజలుగర్వించే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ బడ్జెట్ లో దేవాలయ అభివృద్ధి కి కృషిచేస్తున్నామని.. వేద పండితులు,బ్రాహ్మణుల సంక్షేమానికి కృషిచేస్తుందని వివరించారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని.. పర్యాటక ప్రాంతంగా ఏడుపాయలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news