అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది దుర్మరణం

-

అమెరికాలో మరోసారి తుపాకీ మోత కలకలం సృష్టించింది. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్​ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో ఐదుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. ఓ ఇంట్లో సాధారణ తనిఖీ నిమిత్తం వెళ్లినప్పుడు ఈ మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.

ఆ ఇంట్లో ఏం జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ హత్యలకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఎనోచ్​ నగరంలో 8000 మంది నివసిస్తారు. ఉటా రాజధాని సాల్ట్​ లేక్​ సిటీకి ఈ నగరం 245 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ఘటనపై ఉటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్​ కాక్స్​​ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్​ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news