కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎర్రబెల్లి

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బిజెపి – కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి జరిగినట్లు చూపిస్తారా అంటూ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మహబూబ్నగర్ లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ కంటే ఛత్తీస్గడ్, కర్ణాటకలో మెరుగైన సేవలు అందిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. లేకపోతే మీరు పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని.. క్షమాపణ చెబితే చాలు అన్నారు. ఈ ఛాలెంజ్ కు ఇద్దరు నేతలు సిద్ధమా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మహబూబాబాద్ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news