తెలంగాణలో ఎరో స్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు – కేటీఆర్

-

తెలంగాణలో ఎరోస్పేస్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఈ ఫెసిలిటీ ఏర్పాటు కోసం 2018 నుంచి పలుసార్లు సాఫ్రాన్ తో చర్చలు జరిపామని.. ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలో 8 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిందన్నారు. 250 మందికి ఉద్యోగాలు కల్పించిందని.. ఇప్పుడు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

ఇందు కోసం దాదాపు 1200 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేసిందని.. 1000 మందికి ఉద్యోగవకాశాలు రానున్నాయన్నారు. దేశంలోనే మొదటి MRO సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం చాలాసంతోషమని… బెంగుళూరు, చెన్నై లలో ఏర్పాటు చేయబోయే మరో సెంటర్ ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయాలని సాఫ్రాన్ సి.ఇ.ఓ. ని కోరుతున్నానన్నారు.

అందుకు కావాల్సిన సదుపాయాల్ని కల్పిస్తామని.. ఈ ఫెసిలిటీ సెంటర్ ని భారత్ తో పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉపయోగించుకోనున్నాయన్నారు. సాఫ్రాన్ డిజిటల్ ట్రన్స్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణ ఇవ్వనుందని.. ఏవియేషన్ అండ్ డిఫెన్స్ లలో పెట్టుబడులకి తెలంగాణ అనుకూలంగా ఉందని చెప్పారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news