ఈటల పాదయాత్ర ప్రారంభం నేటి నుండే..

-

టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేశారు. ఆత్మగౌరవంతో బయటకు వచ్చానని చెప్పుకున్న ఈటల, బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే వ్యాహాలు అమలుచేయడానికి సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్ లో పాదయాత్ర చేస్తానని చెప్పిన ఈట. ఈరోజే దానికి శ్రీకారం చుట్టనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని బత్తినివాని పల్లె నుండి ఉదయం 9:30గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.

శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబాల మొదలుకుని మొత్తం 23రోజుల పాటు 127గ్రామాల్లో 270కిలోమీటర్లు పాదయాత్ర జరగనుంది. మరి ఈ పాదయాత్ర కలిసి వచ్చి హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ప్రభావం పడుతుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇటు కాంగ్రెస్ కూడా హుజురాబాద్ ఎన్నికపై ఫోకస్ బాగానే పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news