నల్గొండ జిల్లాలో విషాదం… ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

-

నల్గొండ: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి ముగ్గురు సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు, ఆరోగ్య, కుటుంబ సమస్యలే కారణమని తెలుస్తోంది. కొత్త బ్రిడ్జిపై నుంచి సాగర్ లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు నాగమణి, రామయ్య, సాత్విక్‌గా గుర్తించారు.

స్థానికులు రక్షించే‌లోపే వీరు సాగర్‌లోకి దూకేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య, కుటుంబ సమస్యలేనా.. లేదా వేరే కారణాలున్నాయా అనే కోణంలో కేసు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

 

నిన్నటి వరకూ ఎంతో ఉత్సాహంగా కనిపించిన కుటుంబం.. ఒక్కసారిగా మృత్యుఒడిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news