బాలయ్య అభిమానులు పూనకాలే.. వీరసింహరెడ్డి నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తోంది

-

బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలియజేసి అభిమానుల్లో సంతోషం నింపారు. త్వరలోనే ఫస్ట్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేసాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు బయటకు రానుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలయ్య కోసం మరోసారి సాలిడ్ స్కోర్ ఇచ్చాడు థమన్. 2023 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ మెయిన్ విలన్‌గా నటిస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news