Road Accident: వరంగల్‌లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి!

-

వరంగల్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని ఖానాపూరం మండలం గ్రామ శివారులోని చిలుకమ్మనగర్ పర్శతాండ దగ్గర్లోని చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

warangal-Tractor
warangal-Tractor

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి పనుల్లో భాగంగా సామన్లు తీసుకొచ్చేందుకు వెళ్తుండగా.. చెరువు కట్టపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని, అలా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందన్నారు. ఈ ఘటనలో గుగులోతు స్వామి, జాటోత్ బిచ్చమ్మ, సీత.. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శాంతమ్మ, గోవింద్ అనే ఇద్దరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచారన్నారు. కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news