అన్న క్యాంటీన్ లకు మాజీ ఎంపీ భారీ విరాళం

-

ఏపీలో ఇటీవల అన్న క్యాంటీన్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను గుడివాడ నియోజకవర్గంలో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం… విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు ప్రకటించారు.

 

Former MP Laila Group Chairman Gokaraju Gangaraju’s Donation for Anna Canteens

దీంతో చాలామంది వరుసగా విరాళాలు ఇస్తున్నారు. తాజాగా అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ గోకరాజు గంగరాజు విరాళం అందించడం జరిగింది. అన్న క్యాంటీన్లో కోసం దాదాపు కోటి రూపాయలు అప్పగించారు గోకరాజు గంగరాజు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉదారమైన సహకారానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version