తెలుగు రాష్ట్రాలకు సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ విరాళం..

-

తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వరదల్లో పలు గ్రామాలు, కాలనీలు నీట మునిగగా జనజీవనం స్తంభించిపోయింది.వరదల్లో ఇళ్లు కోల్పొయిన వారిని ఆదుకుంటామని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చెప్పారు.అయితే, రాష్ట్రాలకు జరిగిన నష్టం వేలకోట్లలో ఉంటుందని అధికారులు లెక్కలు తీస్తున్నారు. వెంటనే వరద సాయం ప్రకటించాలని కేంద్రాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు కోరినందున ఈ మేరకు నిధుల విడుదలయ్యే వరుకు ఎదురుచూడాల్సిందే.

అయితే, భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకునేందుకు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సైతం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలు సైతం ఫండ్స్ అందించేందుకు ముందుకువచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ, తెలంగాణకు చెరో రూ.10లక్షల మేర మొత్తం 20 లక్షల విరాళ ప్రకటించారు.అందుకు సంబంధించిన చెక్కులను ఢిల్లీలోని రెండు తెలుగు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version