కీచక”మృగం”: నాలుగేళ్ల బాలికపై అఘాయిత్యం… పోక్సో కేసు నమోదు!

-

సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి నేడు మన చుట్టూ జరుగుతున్న అమానవీయ ఘటనలు మరియు సంఘటనలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీ బంజారాహిల్స్ పరిధిలో జరిగిన ఘోరం గురించి తెలిస్తే కన్నీళ్లాగవు. ఒక నాలుగు సంవత్సరాలు ఉన్న చిన్నారిని ఒక కీచక ఆటో డ్రైవర్ మాయ మాటలు చెప్పి… చాక్లెట్స్ ఇచ్చి తనతో పాటు ఆటోలో ఎక్కించుకున్నాడు.

 

ఎవ్వరూ రాని సమయం చూసుకుని ఆటోలో ఆ ముక్కుపచ్చలారని పసిపాపపై తన మృగవాంచ తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. ఎలాగో పక్కని వారు ఈ విషయాన్ని తెలుసుకుని బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన మృగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. ఈ విషయం తెలిసిన వారు ఆ వ్యక్తికి మరణశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news