గరికపాటిపై చోటాకె నాయుడు సీరియస్.. మెగాస్టార్ ముందే !

-

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా.. రాగద్వేషాలకు అతీతంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు అసహనం వ్యక్తం చేశారు.

దీంతో గరికపాటి ప్రవర్తనపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా గాడ్‌ ఫాదర్‌ సక్సెస్‌ మీట్‌ లో చిరంజీవి భక్తుడు ఛోటా కె. నాయుడు గరికపాటి పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎంత మంది స్టార్లు ఉన్నా.. మెగాస్టార్‌ ముందు సరిపోరని చురకలు అంటించారు.

గరికపాటి అనే వాడేవడో… ఫొటోలు తీసుకొంటామండీ.. ఆయనపై అభిమానంతో తీసుకుంటాం. మాట్లాడేవాడు మహా పండితుడు.. ఆయన అలా మాట్లాడొచ్చా అండీ.. అది తప్పుకాదా.. అలాంటి వాడిని కూడా భోజనానికి చిరంజీవి రమ్మన్నాడు అంటూ ఓ రేంజ్‌ లో సీరియస్‌ అయ్యాడు ఛోటా కె. నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news