ఏపీలో మరో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఈ సారి సీఎం జిల్లాలోనే..

-

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు ఏపీ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పరుచుతున్నారు. అయితే.. ఇప్పుడు సీఎం జగన్ జిల్లాలో లోనే ఓ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది.

ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ మైనరు బాలిక ఆశ్రయం పొందుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటారు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయింది. అయితే.. ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్‌ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 4న మహిళా కానిస్టేబుల్‌ మల్లీశ్వరి బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా… ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని వారు సమాధానమిచ్చారని పేర్కొంది. ఆ బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్‌ మల్లీశ్వరి వీడియో తీశారు. అనంతరం పట్టణంలోని ఓ సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సీఐ ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే అమృతనగర్‌లోని ఓ ఆశ్రమానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్‌ పోలీసులూ కేసు నమోదు చేయకుండా… ఆ బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఆశ్రయం పొందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news