జర్నలిస్టులకు శుభవార్త.. మేనిఫెస్టో లో టీ- కాంగ్రెస్ కీలక హామీలు

-

తెలంగాణ ఎన్నికల వేళ టీ-కాంగ్రెస్ శుక్రవారం మేనిఫెస్టో ను విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిపెస్టోలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో జర్నలిస్టులు సంతోషపడుతున్నారు.

మేనిఫెస్టో లో చేర్చిన హామీలు ఇవే..!

సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడం. అర్హులైన ప్రిం్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారిగా ఇండ్ల స్థలాలు కేటాయించడం.

మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5లక్షల నగదు ఆర్థిక సహాయం
రిటైర్ అయిన జర్నలిస్టులకు పింఛన్

జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందేవిధంగా హెల్త్ కార్డులు జారీ చేయడం వంటి అంశాలను టీ-కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది.

కేవలం జర్నలిస్టులకే కాదు.. నిరుద్యోగులకు, మహిళలకు, యువత కోసం, రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థినిలకు ఇలా అందరికీ అదిరిపోయేలాంటి శుభవార్తలు ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version