మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్

-

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురం పట్టణంలోని రామ్‌నగర్‌లో ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించలేదని ఆరోపణలు వస్తున్నాయి. గోరంట్ల మాధవ్ ఇటీవల నగ్న వీడియో కాల్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ మహిళతో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై బురద జల్లేందుకే ఆ వీడియోను మార్ఫ్ చేశారని మాధవ్ ఆరోపించారు. కానీ, ఆ వీడియోలో ఉన్నది మాధవేనని, ఫోరెన్సిక్ నిపుణులు కూడా అదే విషయం చెప్పారని టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు.

Nude video claimed to be mine is fake': Andhra MP Gorantla Madhav alleges  conspiracy | The News Minute

ఈ క్రమంలోనే ఆ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో గోరంట్ల మాధవ్ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మాధవ్ ఉంటున్న ఇంటికి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని ఆ ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు అద్దె బకాయిలు చెల్లించాలని కోరిన తనను టిప్పర్లు పెట్టి తొక్కించేస్తామంటూ మాధవ్ అనుచరులు బెదిరించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాధవ్ తన ఇంట్లో అద్దెకుంటున్నారని, అద్దె, విద్యుత్ బకాయిలు మొత్తం కలిపి 2 లక్షల వరకు బకాయిపడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని అడిగితే మాధవ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మాధవ్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసేందుకు, ధర్నా చేసేందుకు కూడా మల్లికార్జున రెడ్డి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ నేపథ్యంలోనే మాధవ్ కు మల్లికార్జున రెడ్డికి మధ్య పోలీసులు మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news