నేడు గుజరాత్ తొలి దశ ఎన్నికలు.. బీజేపీకి షాక్ తప్పదా !

-

నేడు గుజరాత్‌ తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం 8గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానున్నాయి. 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుండగా, తొలి దశలో బరిలో నిలిచిన 788 మంది అభ్యర్థులు గా ఉన్నారు.

 

14,382 పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం చేశారు అధికారులు. అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపాయి కాంగ్రెస్‌, బీజేపీ. పోటీలో ఉన్న వారిలో 719 మంది పురుషులు కాగా, 69 మంది మహిళలు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో పోటీపడుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో బరిలోకి దిగింది.బీఎస్పీ, ఎంఐఎం, వామపక్షాలు కూడా పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news