రేవంత్, బండి సంజయ్ ఇద్దరూ చెడ్డీ గ్యాంగ్ : గుత్తా

-

బీజేపీ, కాంగ్రెస్‌ లపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. – రేవంత్, బండి సంజయ్ లు సీఎం అయితే.. చెడ్డీ గ్యాంగ్ ల్లాగా దోపిడికి పాల్పడటం ఖాయమన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని… రైతు చట్టాల రద్దు కోసం పోరాటం చేస్తున్న వారిపై దాడి హేయమైన చర్య అని తెలిపారు. ఇక్కడ బండి సంజయ్ నీతులు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ దమనకాండ అని… దేశంలో బీజేపీ పాలనపై ప్రజా గ్రహం ఉందన్నారు.

హుజూరాబాద్ లో టీఆరెస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని… బైపోల్ లో.. బీజేపీ కి భంగపాటు తప్పదని తెలిపారు. టీఆరెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోన్న టీపీసీసీ… తెలంగాణలో కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ని కొందరు సీనియర్ నేతలు ఎందుకు ఒప్పుకోట్లేదని ప్రశ్నించారు.

మీ అధిష్టానం అనుమతి లేకుండా టాయిలెట్ వెళ్లలేరు కదా.. ? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. ఆనాడు అధికారం కోసం.. ఎన్ని మత కల్లోలాలు సృష్టించారో ప్రజలందరికీ తెలుసన్నారు.  తెలంగాణ నుంచి రూ. 2.40లక్షల కోట్లు పన్నులు చెల్లిస్తుంటే.. కేవలం లక్షన్నర కోట్లే రాష్ట్రానికి వస్తోందని తెలిపారు. .

Read more RELATED
Recommended to you

Latest news