బిఆర్ఎస్ కి భయపడి బిజెపి మునుగోడు ఎన్నికల కుట్ర చేసింది – హరీష్ రావు

-

బిఆర్ఎస్ కి భయపడే బిజెపి మొనుగోడు ఉప ఎన్నికలకు కుట్ర చేసిందని ఆరోపించారు ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు. హయత్ నగర్ లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఎల్ఐసి ఏజెంట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ పోరాటానికి సిద్ధమైన కేసీఆర్ దృష్టిని మరల్చేందుకే బిజెపి మునుగోడు ఉప ఎన్నికలకు కుట్ర చేసిందని ఆరోపించారు.

ఇది వేలకోట్ల కాంట్రాక్టు ఇచ్చి తెచ్చిన ఉప ఎన్నిక అని.. ప్రజల కోసం కాదని అన్నారు. ఈ ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఎన్నిక అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ గెలుస్తోందని జోష్యం చెప్పారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news