హుజురాబాద్ ఉపఎన్నిక రసవత్తరం.. నేడు హరీష్ రావు వంతు.

-

తెలంగాణ రాజకీయాలను సర్వత్రా ఆసక్తికరంగా మార్చేసిన అంశం ఏదైనా ఉందంటే అది హుజురాబాద్ ఉపఎన్నిక అనే చెప్పుకోవాలి. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి నెలకొన్న రసవత్తర సంగ్రామం ఉపఎన్నిక పూర్తయ్యేదాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు హుజురాబాద్ పై దృష్టి కేంద్రీకరించాయి. అటు ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించారు. ఇటు వివిధ రాజకీయ పార్టీలు హుజురాబాద్ లో ఎవరిని పోటీకి దింపాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు.

మరో పక్క సిట్టింగ్ సీటును కోల్పోవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి గట్టి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజ్జు హరీష్ రావు హుజురాబాద్ పర్యటించనున్నారు. అక్కడ బైక్ ర్యాలీలో పాల్గొననున్నారని సమాచారం. ఈ బైక్ ర్యాలీ జమ్మికుంట వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో అందరిలో ఆసక్తి నెలకొంది. మరేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news