ఏపీలో భారీ వర్షాలు..ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

-

శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు ఏపీ విపత్తుల సంస్థ. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి, సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి సిగడాంకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు.

విజయనగరం జిల్లాలోని.. శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలసకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు.

అనకాపల్లి జిల్లాలోని.. చీడికాడ,కె.కొత్తపాడు, దేవరపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి, పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట,బలిజిపేట,పాలకొండ మండలాలు మరియు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని వెల్లడించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండని సూచనలు చేసింది ఏపీ విపత్తుల సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news