బ్రేకింగ్ : కూలిన ప్రభుత్వ హెలికాప్టర్‌.. ఇద్దరు మృతి

-

రోజువారీ శిక్షణలో పైలట్లు ఫ్లయింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా ప్రమాదం జరిగి హెలికాప్టర్ కూలిన ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్​పోర్ట్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతిచెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్రి పైలట్లు ఫ్లయింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రన్‌ వే చివర్లో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్ తునాతునకలు అయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

Helicopter Crash in Raipur: 2 pilots killed including 1 from Odisha

అంతేకాకుండా హెలికాప్టర్ లో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారని ఎస్‌ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ తెలిపారు. మృతులను కెప్టెన్‌ గోపాల్‌ కృష్ణ పాండా, కెప్టెన్‌ ఏపీ శ్రీవాత్సవగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని దేశించారు సీఎం భూపేశ్.

Read more RELATED
Recommended to you

Latest news