గోదావరి నేపథ్యంలో కార్తికేయ ‘బెదురులంక 2012’

-

హీరో కార్తికేయ తన నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యారు. నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి ‘బెదురులంక 2012’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బుధవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. “ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది. దీంట్లో మనసుకు నచ్చినట్లుగా జీవించే కుర్రాడిగా కార్తికేయ కనిపిస్తారు. సమాజానికి నచ్చినట్లు బతకడం సమంజసమా.. మనసుకు నచ్చినట్లు బతకడం సమంజసమా? అన్నది సినిమాలో చూడాలి” అన్నారు.

“కామెడీ డ్రామాగా.. గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మణిశర్మ ఐదు అద్భుతమైన పాటలిచ్చారు. ఇందులో ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారు’’ అని దర్శకుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version