టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరటనిచ్చిన హైకోర్ట్

-

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఉరట లభించింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ధాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి నియామకం చెల్లదని రిట్ పిటిషన్ దాఖలు చేసారు నవీన్ కుమార్ రెడ్డి. ఈ పిటిషన్ ను పరిశీలించిన ఏపీ హైకోర్టు పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.

టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా నియమించాలంటే దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 107లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అదే స్థాయిలో ఏ పదవిచేసి ఉన్నా సరిపోతుందని హైకోర్టు తెలిపింది. ఏవి ధర్మారెడ్డి అర్హతల్లో జిల్లా కలెక్టర్ సమానమైన పదవిని రాష్ట్ర ప్రభుత్వంలో చేయడాన్ని పరిగణలోకి తీసుకుంది న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Latest news