పిఎమ్ కిసాన్ కు ఆధార్ లింక్ ను ఇలా చేసుకోవాలి..!

-

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద  రైతులకు కొంత నిధులు అయితే అందుతున్న సంగతి తెలిసిందే..11 విడతల ద్వారా 2000 రూపాయలు అందుతున్న సంగతి తెలిసిందే..అయితే, ఇప్పుడు మరోసారి పిఎమ్ కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో పడనున్నాయి. ఈ మేరకు రైతులు ఆధార్ వివరాలను నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తించడానికి కేంద్రం అనేక నిబంధనలు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) నుంచి ఆధార్‌ నమోదునూ తప్పనిసరి చేసింది. ఈకేవైసీ పూర్తిచేయడానికి, కొత్తగా ‘పీఎం కిసాన్‌’లో నమోదుకు తొలుత 2022 మార్చి 31 దాకా కేంద్రం గడువు పెట్టింది. అప్పటికి రైతులు స్పందించలేదని గడువును ఈ నెల 31 దాకా పొడిగించింది. ఇప్పటికీ తెలంగాణలో 11 లక్షల మంది రైతులే ఆధార్‌ నమోదు చేశారని అధికారులు వెల్లడించారు..

జులై 31 దాకా గడువు పొడిగించనున్నట్లు సమాచారం ఉందని వివరించారు. రైతు బ్యాంకు ఖాతాలో ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఆర్థిక సంవత్సరంలో 3 దఫాలుగా మొత్తం రూ.6 వేలు కేంద్రం జమచేస్తోంది. దేశవ్యాప్తంగా గతేడాది 11.11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేయగా తెలంగాణలో 37.62 లక్షల మందికి అందాయి…

పిఎమ్ కిసాన్ కు ఆధార్ ను ఎలా లింక్ చేయాలి..

పీఎం కిసాన్‌ పోర్టల్‌లోకి వెళితే ‘ఈకేవైసీ’ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్‌ చేస్తే ఆధార్‌ సంఖ్యను నమోదు చేయాలని అడుగుతుంది. నమోదు చేయగానే ఆ సంఖ్యతో అనుసంధానమై ఉన్న రైతు ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, ఈ ప్రక్రియలో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నో ఏళ్ల క్రితం ఆధార్‌ కార్డు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఫోన్‌ నంబరు ఇప్పుడు కొందరు వాడటం లేదు. ఓటీపీ రావాలంటే ఆధార్‌తో అనుసంధానం చేసిన ఫోన్‌ నంబరే రైతు వద్ద ఉండాలి.. కొత్త నెంబర్ తో లింక్ చేసిన తర్వాత పిఎమ్ కిసాన్ కు అప్లై చేయాలి.. అప్పుడే మోడీ వేస్తున్న డబ్బులు రైతుల అకౌంట్ లో పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news