పిండి కి పురుగులు పట్టకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

మనం రకరకాల పిండిలని వాడుతూ ఉంటాము. గోధుమ పిండిని మైదా పిండి ఇలా చాలా వాటిని మనం వంటలకి ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా మనం గోధుమ పిండిని బాగా వాడుతూ ఉంటాము తరచూ చపాతీ రోటి వంటి వాటిని తయారు చేసుకోవడానికి మనం గోధుమ పిండి వాడుతూ ఉంటాము అయితే పిండిని సరిగ్గా స్టోర్ చేసుకోక పోతే పురుగులు పట్టేస్తూ ఉంటాయి. దాంతో పిండంతా పాడై పోతుంది పెద్ద శ్రమ.. ఇలా పిండి పాడై పోకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే పురుగులు వంటివి పట్టవు. ఫ్రెష్ గా ఉంటుంది.

పిండి ని ఇక మరి ఎలా పిండిని స్టోర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. పిండి ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉండాలన్నా పురుగు పట్టకుండా ఉండాలన్నా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి గ్లాస్ జార్ లేదంటే ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లు లో పిండిని వేసి సరిగ్గా మూత పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే పురుగులు పట్టవు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది పిండి. కొంతమంది పిండిని ఆడించుకోరు కొనుక్కొని చేస్తూ ఉంటారు. అయితే కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ని చూడాలి ఎక్స్పైరీ డేట్ ని చూసి మాత్రమే కొనండి. డేటు దగ్గరగా వున్నా లేదంటే ముగిసి పోయినా తీసుకోకండి .

ముఖ్యంగా పిండి పాడవడానికి కారణం తేమ. తేమ పట్టకుండా ఉండాలంటే మీరు ఒక మంచి డబ్బాలో పెట్టండి స్టీల్ డబ్బాలో పెడితే తేమ పట్టకుండా ఉంటుంది. అలానే మీరు స్టోర్ చేసేముందు వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే పిండి వేయండి. మూడు లేదా నాలుగు టీ స్పూన్లు సాల్ట్ వేసి పిండిని పెడితే కూడా పిండికి పురుగులు పట్టకుండా ఉంటాయి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పిండిలో ఒక రెండు బిర్యానీ ఆకులు వేస్తే కూడా పిండి నిల్వ బాగుంటుంది పాడైపోదు పురుగులు వంటివి పట్టవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version