అధికారమిస్తే ఐదేళ్లలో రాజధాని కట్టి చూపిస్తాం – సోము వీర్రాజు

-

ఏపీకి అమరావతే రాజధాని అనే అంశంలో బిజెపి స్పష్టంగా ఉందని వెల్లడించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. తమకు అధికారం ఇస్తే ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గత టిడిపి ప్రభుత్వానికి రాజధాని కోసం ఇచ్చిన తొమ్మిది వేల కోట్లు ఏమయ్యాయో తెలియదని సోము వీర్రాజు అన్నారు. అమరావతి లోనే రాజధాని కడతానని అన్న సీఎం జగన్ మడమ తిప్పారని అన్నారు.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వాలని అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. జనసేనతోనే బిజెపి పొత్తులో ఉందని, జనసేనతో కలిసే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నామని ప్రకటించారు సోము వీర్రాజు. ఇక పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పై చేసిన వ్యాఖ్యల విషయంలో సోము వీర్రాజు నో కామెంట్ అంటూ దాటవేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version