దీపావళి ముందు రోజు ఉప్పు కొంటే మీ సంపద రెట్టింపు అవుతుంది..!!

-

ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24వ తేదీ వచ్చింది. దీపావళికి ముందు రోజు అంటే అక్టోబర్ 23 ఆదివారం ధన్‌తేరాస్ జరుపుకుంటారు. ఈ రోజునే ధన్ త్రయోదశి, ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, ఈ రోజున ఆయుర్వేద వైద్య పితామహుడు, ధన్వంతరి సముద్ర మథనం నుంచి ఉద్భవించాడు.మనస్సు, శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును.

పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి “ధాన్వన్తరీయులు” అని వ్యవహరించడం వాడుకలో ఉంది. భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. ఆ తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది..

ఇక తర్వాత ధన్వంతరి అవతరించాడు. “అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి “ధన్వంతరి” అని పేరు పెట్టారు..అందుకే ధన్ తేరస్ రోజున పాత్రలు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. దీపావళి ధన్తేరస్ రోజు నుండి ప్రారంభమవుతుంది. ధంతేరస్ రోజున, సంపద, శ్రేయస్సు కోసం వివిధ రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. ఉప్పు నివారణ ఇందులో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది..

ఈ ఉప్పు వల్ల కలిగే శుభ పరిణామాలు ఏంటో చుద్దాము..

  • ఇంటికి కొత్త ఉప్పు ప్యాకెట్ తీసుకురండి. ఆ రోజు అన్నింటిలోనూ కొత్త ప్యాకెట్‌లోని ఉప్పు మాత్రమే ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు.
  • ఇంటికి తూర్పు, ఉత్తరం మూలలో గాజు గిన్నెలో కొద్దిగా ఉప్పు వేయండి. ధంతేరస్ రోజున ఇలా చేయడం వల్ల పేదరికం తొలగిపోయి.. సంపదకు కొత్త దారులు తెరుచుకుంటాయని నమ్ముతారు.
  • ఈ రోజున, ముఖ్యంగా ఇంట్లో ఉప్పునీరు మాత్రమే తుడవాలి. ఇది ఇంటి నుండి ప్రతికూలతను తరిమికొడుతుంది. అంటే నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.
  • భార్యాభర్తల మధ్య వైవాహిక బంధంలో చీలికలు ఏర్పడితే ధన్‌తేరస్ రోజున ఈ పరిహారం చేయాలి. రాత్రిపూట మీ పడకగది మూలలో ఒక చిన్న రాతి ఉప్పు లేదా తెల్లటి ఉప్పును ఉంచి నిద్రించండి. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.
  • ఉప్పు శుక్రుడు, చంద్రుడిని సూచిస్తుంది..అందుకే ఉప్పును స్టీలు, రాగి,ఇనుము పాత్రలో ఉంచరాదు..అందుకే ప్లాస్టిక్, గాజు పాత్రలలో మాత్రమే ఉంచుతారు..

Read more RELATED
Recommended to you

Latest news