IND vs AUS: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ… ఆసీస్ టార్గెట్ ఎంత అంటే…?

-

టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా సెయింట్ లూసియాలోని డారెన్ సామి స్టేడియం వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

భారత్ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక మరో ఓపినర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచారు.స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. దీంతో ఆ ఓవర్లో ఒక వైడ్తో కలిపి మొత్తం 29 రన్స్ వచ్చాయి.కెప్టెన్ రోహిత్(92) విధ్వంసానికి తోడు సూర్య (31) మెరుపులు మెరిపించడంతో ఇండియా భారీ స్కోర్ చేయగలిగింది. శివము దూభే 28 రన్స్ , హర్డిక్ పాండ్య 27 పరుగులు, పంత్ 15 పరుగులు చేశారు.ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు. ఆస్ట్రేలియా టార్గెట్ 206 పరుగులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version