రెండో టెస్ట్ లో దుమ్ములేపిన భార‌త్‌.. 372 ప‌రుగుల‌తో తేడాతో కివీస్ పై విజ‌యం

-

రెండో టెస్ట్ మ్యాచ్ లో కివీస్ గడ్డపై భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ జట్టుపై ఏకంగా 372 పరుగుల తేడాతో ల్యాండ్ విసిరికొట్టింది టీమిండియా జట్టు. ఈ విజయంతో 1-0 తేడాతో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది భారత జట్టు. మొదటి ఇన్నింగ్స్ తరహాలోనే రెండో ఇన్నింగ్స్ లోనూ.. న్యూజిలాండ్ జట్టు తడబడడం తో ఇండియా విజయం అనివార్యమైంది.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసి ఆలౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో 276 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక అటు న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో… కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండు ఇన్నింగ్స్ లోనూ న్యూజిలాండ్ జట్టు కేవలం 167 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయం అనివార్యం అయిపోయింది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో… ఈ విజయం సాధ్యమైంది. కాగా… న్యూజిలాండ్ జట్టుపై టి20 టోర్నీ టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news