IND vs WI : రెచ్చిపోయిన బౌలర్లు..తొలి మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం

-

టీమిండియా మరో సారి దుమ్ములేపింది. మూడు వన్డేల సిరీస్‌ లో విండీస్‌ ను చిత్తు చేసిన టీమిండియా టీ 20 ల్లోనూ అదే తీరుగా వెళుతోంది ఐదు వన్డేల సిరీస్‌ లో భాగంగా ట్రినిడాడ్‌ టారౌబాలోని బ్రియాన్‌ లారా స్టేడియంలో గత రాత్రి జరిగిన మొదటి మ్యాచ్‌ లో రోహిత్‌ సేన ఏకంగా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా… రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో పాటు దినేష్‌ కార్తీక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగుల చేసింది. అనంతరం 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అర్శదీప్‌ సింగ్‌ 2 వికెట్లు, అశ్విన్‌ 2 వికెట్లు రవి బిష్ణోయ్‌ 2 వికెట్లు పడగొట్టడంతో.. టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌ లో దినేష్‌ కార్తిక్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news