రేషన్ కార్డ్ ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లులు మంజూరు: మంత్రి శ్రీధర్ బాబు

-

రేషన్ కార్డ్ ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లుకు జర ఓపిక పట్టండని అయిన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మంథనిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ…పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని ,వంశీ ఒక యువకుడు, చదువుకున్న వ్యక్తి అని అన్నారు.పదిమందికి మంచి జరుగుతుందా అని చూసినోడే ప్రజా నాయకుడని , కుల బలం, మతబలంతో ఈరోజు తాము రాజకీయాల్లో ఉండాలని రాలేదని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మూర్ఖత్వాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాస్తున్నామని,న్యాయంగా పోయే ఎవరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టదని తెలిపారు. మరో నాలుగున్నర ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటదని అన్నారు.మీరు కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే ఒక పార్టీకి ఓటు వేస్తే వృధాగానే పోతుందని, అభివృద్ధి జరగాలంటే యువకుడైన మన వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి విజ్ఞప్తి చేశారు మంత్రి శ్రీధర్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version