భర్త ముందే గర్భిణిపై సామూహిక అత్యాచారం

-

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ జీలం నగరంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీ ఇంట్లోకి చొరబడిన ఐదుగురు వ్యక్తులు భర్త ముందే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. భర్తను తాళ్లతో కట్టేసి గర్భిణీ పై సామూహిక అత్యాచారం చేశారు. దాడి అనంతరం మహిళ స్వయంగా ఆసుపత్రికి వచ్చింది. బాధితురాలు తనకు జరిగిన బాధను వివరించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె రక్తనమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం లాహోర్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును విచారించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పంజాబ్ ఐజీపీ సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరారు. మహిళలపై జరుగుతున్న నేరాల పరంపరలో ఈ ఘటన పాకిస్తాన్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రతి రోజు 11 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. గత ఆరేళ్లలో 22,000 పైగా అత్యాచారం కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news