తాజ్‌మహల్‌ వద్ద ఫొటో దిగొద్దని భార్యకు చెప్పిన ప్రిన్స్ హ్యారీ

-

తాజ్​మహల్ వద్ద ఫొటో దిగొద్దని తన భార్య మేఘన్ మార్కెల్​ను కోరినట్లు బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ తెలిపారు. ఎందుకు ఫొటో దిగొద్దని చెప్పారో దానికి గల కారణాన్ని హ్యారీ తాను రాసిన పుస్తకం స్పేర్​లో ప్రచురించారు. ప్రస్తుతం ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో హ్యారీ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌కు సంబంధించిన విషయాలనూ ఆయన ప్రస్తావించారు.

2017 జనవరిలో ఓ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా మేఘన్‌ భారత పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత హ్యారీ, మేఘన్‌ల పెళ్లి జరిగింది. అప్పటికి తన ప్రియురాలిగా ఉన్న మేఘన్‌ భారత పర్యటన గురించి ప్రిన్స్‌ హ్యారీ ప్రస్తావిస్తూ.. ‘‘పాలరాతి కట్టడమైన తాజ్‌మహల్‌ ముందు ఫొటో దిగవద్దని మేఘన్‌కు సూచించా. ఎందుకంటే.. ఆ అద్భుతమైన కట్టడం ముందు నా తల్లి (ప్రిన్స్‌ డయానా) ఫొటో దిగారు. అదెంతో ప్రాచుర్యం పొందింది. దాన్ని చూసినవారు మేఘన్‌ మా అమ్మను అనుకరిస్తోందని అనుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అలా చెప్పా’ అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news