శ్రీలంకలో సంక్షోభం : 17 మంది కొత్త మంత్రుల నియామకం

-

ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలంక దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి.. గాడీలో పెట్టేందుకు… ఏకంగా 17 మంది కొత్త మంత్రులను నియమించాడు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే. ఈ మేరకు కాసేపటి క్రితమే… 17 మంది కొత్త మంత్రులు.. ప్రమాణ స్వీకారం చేశారు.

ఇది ఇలా ఉండగా.. శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. డిజిల్, పెట్రోల్, గ్యాస్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేకు వ్యతిరేఖంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఏకంగా 17 మంది కొత్త మంత్రులను నియమించాడు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే.

Read more RELATED
Recommended to you

Exit mobile version